Personality In Detail!



భారత రైతాంగ ఉద్యమ పితామహుడు గా గుర్తించబడిన
స్వాతంత్ర సమరయోధుడు. తెలుగు రైతు గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసిన నాయకుడు గోగినేని రంగనాయకులు.
హేతువాది. మహాత్మాగాంధీ సహచరుడు.
ఆచార్య ఎన్.జి.రంగా పేరు గాంచిన ఈయన
విద్యావేత్తగా
రైతాంగ విధానాలకు మద్దతిచ్చిన నాయకుడిగా ,
రాజకీయ నేతగా,
సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన నేతగా
తొలినాళ్ళలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక సమావేశాలకు భారత ప్రతినిధిగా,
తన బహుముఖ ప్రజ్ఞతో తెలుగు వాడి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియ జేశాడు.

1900, నవంబరు 7 న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో
గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకుజన్మించాడు.
నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు.
1924లో భారతీదేవితో రంగా వివాహం జరిగింది.

1926 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు.
1930 లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి, రంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.

నిడుబ్రోలులో రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు.రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని 1933న
మహాత్మాగాంధీ ప్రారంభించారు.ఎంతోమంది మహామహులైన రాజకీయ నేతలు రంగా గారి శిష్యులే

1933 లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు.

మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రెసు పార్టీని స్థాపించాడు.
రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు.
ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై "బాపు దీవెనలు "
అనే పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు.

రంగా ఆలోచనలు తెలుగునేలను దాటి దేశవ్యాప్తంగా అయ్యాయి అంతటితో ఆగకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిదారుల పక్షాన నిలబడ్డాడు.
అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు.

ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సు
(1946 - కోపెన్‌హేగెన్‌)

అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సు
(1948 - శాన్ ఫ్రాన్సిస్కో)

అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను,
(1952 లో ఒట్టావా)

ఇంటర్నేషనల్ పెజెంట్ యూనియన్
(1954 లో న్యూయార్కు)

ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్
(1955 లో టోక్యో)
వంటి సదస్సులలో
 భారతదేశం తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు.


ఈయన కాంగ్రెసు పార్టీ నుండి నిష్క్రమించి భారత కృషీకార్ లోక్ పార్టీ స్థాపించాడు.
ఆ తరువాత సహకారరంగ వ్యవసాయానికి బద్ధవ్యతిరేకి అయిన రాజాజీతో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించాడు.
స్వతంత్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడుగా సంవత్సరం పాటు ఆ బాధ్యతలు నిర్వహించిన ఆయన
1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి, బలమైన ప్రతిపక్షముగా రూపుదిద్దుకొన్నది.
నాటి రాజకీయ రంగంలో ఇది సంచలనమే.

1972లో రంగా తిరిగి కాంగ్రెసు (ఐ) లో చేరాడు.
రంగా సుదీర్ఘ కాలం సుమారు రెండు శతాబ్దాల కాలం పాటు పార్లమెంట్‌ సభ్యునిగారికార్డు సృష్టించి, గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కారు.
ఆచార్య ఎన్జీ రంగా గారు గుంటూరు వాసి అయినప్పటికీ తెలుగు నేలలో ప్రతి ప్రాంతంలోనూ ఆయనకు విశేషమైన ఆదరణ ఉంది. అందువల్లనే ఆయన రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి ఎన్నికై ప్రాతినిధ్యం వహించారు.

సభపదవీకాలంనియోజకవర్గంపార్టీ2వ లోక్ సభ1957-1962తెనాలికాంగ్రెసు పార్టీ3వ లోక్ సభ1962-1967చిత్తూరుస్వతంత్ర పార్టీ4వ లోక్ సభ1967-1970శ్రీకాకుళంస్వతంత్ర పార్టీ7వ లోక్ సభ1980-1984గుంటూరుకాంగ్రెసు (ఐ)8వ లోక్ సభ1984-1989గుంటూరుకాంగ్రెసు (ఐ)9వ లోక్ సభ1989-1991గుంటూరుకాంగ్రెసు (ఐ)
95 సంవత్సరాల వయస్సులో ఆయన అనారోగ్యంతో 1995 జూన్‌ 8వతేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన "గోభూమి" లో తుదిశ్వాస విడిచారు

ఆయన పేరుతో జాతీయ వ్యవసాయ విశ్వ విద్యాలయము స్థాపించబడింది.

situs slot gacorslot88